వావ్ : ఆర్టీసీ ఆస్తుల‌పై వైసీపీ క‌న్ను ఎందుకంటే?

RATNA KISHORE
డ‌బ్బులిచ్చే ఆలోచ‌నే లేదు. ఉన్న‌ప‌ళంగా డ‌బ్బులు లాక్కోనే ప్లాన్ అయితే ఉంది. అందుకు ఆర్టీసీని వాడుకోవాలి. సంస్థ ఆస్తులు అమ్ముకుంటే కాస్త మ‌న‌కు అన‌గా స‌ర్కారుకు మ‌నుగ‌డ ఖాయం. లేదంటే ఇక్క‌ట్లే అన్న వాద‌న నుంచి కొత్త కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకు వ‌స్తున్నాయి. అయినా కూడా జ‌గ‌న్ ఎక్క‌డా వెనుకంజ వేయ‌డం లేదు. స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం మాట ఎలా ఉన్నా ఆస్తులు వాటి విలువ, వాటిని అమ్ముకునే ప‌ద్ధ‌తి వీటిపై అధ్య‌య‌నం అయితే ప్ర‌భుత్వ వ‌ర్గాలు బాగానే చేస్తున్నాయి.


ఆర్టీసీని గాడీలో పెట్టార‌ని జ‌గ‌న్ ను అంతా ప్ర‌శంసించారు. అందుకు కార‌ణం అయిన ప్ర‌తి నిర్ణ‌యాన్నీ అభినందించారు. విలీనంతో ఆర్టీసీ బ‌తుకే మారిపోతుంద‌ని ఊహించారు. రేప‌టి నుంచి న‌ష్టాల ఊబి నుంచి ఆర్టీసీ గ‌ట్టెక్క‌డం ఖాయం అని చాలా మంది ఆశించారు. ఉద్యోగులు కూడా జ‌గన్ కు బాస‌ట‌గా నిలిచారు. అందుకే కేసీఆర్ చేయ‌లేని ప‌ని జ‌గ‌న్ చేసినందుకు అంతా వైసీపీ బాస్ ను అభినందించారు. కానీ ఇక్క‌డే అస‌లు మ‌త‌లబు ఉంది. అప్పుల‌తో నెట్టుకు వ‌స్తున్న ప్ర‌భుత్వానికి ఆర్టీసీ ఆస్తులు కావాలి. ఆర్టీసీలో సంస్థ భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం, ఉద్యోగులంతా క‌ల‌సి దాచుకున్న పీఎఫ్ కోసం ఉంచిన డ‌బ్బు జ‌గ‌న్ కు కావాలి. ఎందుకంటే స్టేట్ ప‌వ‌ర్ ఫైనాన్స్  కార్పొరేష‌న్ కు నిధులు లేవు. నిధులు వ‌స్తే లేదా ఇలా అప్ప‌ణంగా దోచుకుంటే అప్పుడు సంక్షేమ  ప‌థ‌కాల‌కు నిధులు ఇవ్వ‌డం సులువు అవుతుంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఆరోప‌ణ ఎలా ఉన్నా త్వ‌ర‌లో ఆర్టీసీ పెద్ద బ‌స్ స్టేష‌న్ల‌న్నీ ప్ర‌యివేటీక‌ర‌ణ వైపు మ‌ళ్లనున్నాయి.



విజ‌య‌వాడ బ‌స్ స్టేష‌న్ ను ప్ర‌యివేటు వ‌ర్గాల‌కు ద‌శ‌ల వారీగా అప్ప‌గించేందుకు సన్నాహాలు అవుతున్నాయ‌ని స‌మాచారం. ఇవి ఎలా ఉన్నా ఇప్ప‌టికిప్పుడు ఆస్తుల బ‌ద‌లాయింపు, వేలం వేయ‌డం, అమ్ముకోవ డం అన్న‌వి జ‌ర‌గ‌వు క‌నుక ఆశించిన రీతిలో ఊహించిన ప‌ద్ధ‌తిలో ఇవి న‌డ‌వ‌వు క‌నుక జ‌గ‌న్ ఉన్న‌ట్టుండి పీఎఫ్ ఖాతాల‌ను త‌నవైపు మ‌ళ్లించుకోవాల‌ని ప్లాన్ చేశార‌ని విప‌క్షం ఆరోప‌ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: