నేనే జయలలిత వారసురాలిని.. షాకిచ్చిన మహిళ?

praveen
సినీ నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది జయలలిత. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి తనదైన శైలిలో రాజకీయాల్లో సరికొత్త మార్క్ క్రియేట్ చేసింది జయలలిత. ఏకంగా తమిళ ప్రజలందరికీ అమ్మగా పేరు తెచ్చుకుంది. ఎన్నో ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పాలన సాగించి పేదల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసింది అని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారిపోయాయి.


 అయితే ఇలా తన సుపరిపాలన తో ఎంతో మంది పేద ప్రజలకు అమ్మ గా మారిన జయలలిత ఇక ఆ తర్వాత అనారోగ్యం బారిన పడి ప్రాణాలు వదిలారు. అయితే జయలలిత మరణాన్ని తమిళప్రజల తట్టుకోలేక పోయారు. ఇక జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయలలిత వారసులం మేమే అంటూ ఎంతో మంది తెర మీదికి వచ్చారు. అంతేకాదు జయలలిత ఆప్తులు రాలిగా  ఉన్న శశికళ.. జయలలిత స్థానాన్ని దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేశారు.


 ఇక ఇప్పుడు నేనే జయలలిత వారసురాలిని అంటూ మరో మహిళ తెర మీదికి రావడం సంచలనం గా మారి పోయింది. ఇటీవలే జయలలిత వారసురాలిని తానే అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను వెనక తలుపు నుంచి వెళ్లి రహస్యంగా కలిశానని చెబుతుంది సదరు మహిళ. చెన్నైకి చెందిన ప్రేమ అనే మహిళ ఈ వ్యాఖ్యలు చేసింది. సమయం వచ్చినప్పుడు తానే జయలలిత వారసురాలిని అని నిరూపించుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. తొందర్లోనే వెళ్లి శశికళను కలుస్తాను అంటూ తెలిపింది. కాగా ఈ మహిళ చేసిన వ్యాఖ్యలు కాస్త తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: