తెరాస ప్లీనరీ ఒక రేంజ్ లో అంటున్న కేటిఆర్...?
ప్రభుత్వం ద్వారా ఎన్నో విజయాలు సాధించాం అని అన్నారు కేటిఆర్ . మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రజలు తెలంగాణ లో కలుస్తామని అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అని ఆయన అన్నారు. మరోవైపు కర్ణాటక రాయచూర్ ప్రజలు కూడా తెలంగాణ లో కలుస్తామంటుంన్నారు అని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వానికి తెలంగాణ పథకాలు ఆదర్శమవుతున్నాయి అని కేటిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతుంది అని ఆయన వెల్లడించారు. అర్బన్ ఫారెస్ట్ ను తెలంగాణ లో ఎలా అభివృద్ధి చేస్తున్నారు అని చూడడానికి కేంద్ర ప్రతినిధులు వచ్చారు అని కేటిఆర్ అన్నారు.
తెలంగాణ అభివృద్ధి ని భారతదేశం ఆచరించక తప్పదనే పరిస్థితి వచ్చింది అని కేటిఆర్ వివరించారు. ప్లీనరీ , మా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మాకు అత్యంత కీలకమైనవి అని అన్నారు. ఈ పార్టీ ప్లీనరీ కమిటీకి ఆహ్వాన కమిటీ.. సబితా ఇంద్రారెడ్డి, రంజిత్ రెడ్డి, గాంధీ, మేయర్ అలాగే సభా ప్రాంగణం... గ్యాదరి బాలమల్లు ,మారెడ్డి శ్రీనివాస్, మాగంటి ,బొంతు రామ్మోహన్, వాలంటీర్ కమిటీ... శంబీపూర్ రాజు ఉంటారని వివరించారు. 4వేల వాహనాలు వచ్చే అవకాశం ఉంది.. ఇబ్బంది కాకుండా పార్కింగ్ స్థలాలు గుర్తించాం అన్నారు. పార్కింగ్ కమిటీ... వివేకానంద గౌడ్ ,బండి రమేష్ ఉంటారని ఫుడ్ కమిటీ.. మాధవరం కృష్ణారావు ఉంటారని వెల్లడించారు.