మా ఎన్నికలను ఈ సారి ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణులు ఎంతో ప్రస్టేజియస్ గా తీసుకున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. మా ఎన్నికలంటే ఎలాంటి హడావిడి లేకుండా లోలోపలే జరిగేవి. కానీ ఆ సారి రెండు నెలల ముందే ప్రచారాలు మొదలుపెట్టడం..ఒకరిపై మరొకరు ప్రశంసలతో మీడియా కూడా ఎక్కవ ఫోకస్ చేడంతో హడావుడి మరింత పెరిగింది. మా ఎన్నికల్లో పోటీచేసిన ప్రకాష్ రాజ్ కొద్ది రోజులుగా తన షూటింగ్ లను పక్కన పెట్టుకుని తనకు ఎంతో చేసిన మాకు తిరిగిస్తానంటూ ప్రచారం లో దూసుకుపోయారు. మెగా ఫ్యామిలి మద్దతు ఉందనగానే ప్రకాష్ రాజ్ గెలుపు కాయమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కానీ మెగా ఫ్యామిలీ నుండి కేవలం నాగబాబు మాత్రమే ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్టు బహిరంగంగా చెప్పగా మిగితావాళ్లు మాత్రం నోరు మెదపలేదు. మరో వైపు మంచు విష్ణు ప్రచార జోరు మోహన్ బాబు సపోర్ట్ వరాల మ్యానిఫెస్టోతో ముందుకు రావడంతో మంచు విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంతో ఓ సారి మీడియా ముందే ప్రకాష్ రాజ్ కన్నీరు పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలుగు వారి అభివృద్ధికి కృషి చేస్తానని తమిళ సినీ రంగం విధంగా ఓ సినిమా తీసి ఆ మొత్తాన్ని మా కోసం ఖర్చు పెడతానని ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చారు.
అందు కోసం నటీనటులను దర్శకులను కూడా ఒప్పించే సత్తా ఉందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మాకు భవనం కడితే ఏం ఉపయోగమని ఓ ఫంక్షన్ హాల్..జిమ్...అన్నింటితో కూడిన సార్వత్రిక భవనాన్ని నిర్మించి ఇస్తానని దానికోసం విదేశాలకు వెళ్లి ఫండ్స్ ను తీసుకువస్తానని చెప్పారు. ఎన్నో ఆశలతో ప్రకాష్ రాజ్ ప్రణాళికలు వేసుకోగా చివరికి ఎన్నికల్లో ఓడిపోయారు.. దాంతో తీవ్ర ఆవేదన చెందుతున్న ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు సినిమా షూటింగ్ లకు కూడా దూరంగా ఉన్నట్టు సమాచారం.