మీడియా రంగంలోకి ఆదానీ..సంక్షోభమే అవకాశమా..?
మీడియా రంగం పడిపోవడానికి ప్రధాన కారణం కరోనా క్రైసీస్. ఇందులో మరి పత్రికలు బాగా దెబ్బతిన్నాయి. టీవీ ఛానెల్స్ వ్యూస్ షిప్ పెరిగింది కానీ దానికి తగ్గట్టుగా ఇన్కమ్ పెరగకపోవడం గమనించాలి. కరోనా టైమ్లో వ్యూస్షిప్ పెరిగినా.. వస్తువినియోగం తగ్గడంతో కంపెనీల బిజినెస్ ఆటోమెటిక్గా తగ్గిపోతుంది. దీని కారణంగా మీడియాకు వచ్చే అడ్వరైజింగ్ ఇన్కమ్ భారీగా తగ్గిపోయింది. ఇక దీనికి తోడు డిజిటల్ మీడియా గణనీయంగా పెరిగింది. వాస్తవానికి ఫిజికల్గా ఉన్న ఛానల్స్, పత్రికల నిర్వహణ చాలా ఎక్కువగా ఉంటుంది.
మీడియాలో సంక్షభం వస్తే మనకేంటి అనుకుంటే.. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి మంచి వార్తలు అందించే పత్రికలు, న్యూస్ ఛానెల్స్ అడ్ రెవెన్యూ తగ్గడం ద్వారా మంచి కంటెంట్ను ప్రజలకు అందించలేరు. రెండవది పెద్ద మీడియా రంగాలను పేరున్న ఛానెల్స్ను, పత్రికలను కార్పోరేట్ వాళ్లు కొనుగోలు చేస్తారు. వాళ్లకు వీటి ద్వారా లాభాలు రావాలని ఏం ఉండదు ఎందుకంటే వాళ్ల బిజినెస్ ఘననీయంగా ఉంది. ఇప్పటికే మీడియా రంగంలోకి టాటాలు, అంబానీలు వచ్చారు. ఇప్పుడు అదానీలు కూడా ఎంటర్ అవుతున్నారు.
మీడియా ను తమ చేతుల్లోకి తీసుకుని వారికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాని గురించి వార్తలు రాస్తూ ప్రజల వద్దకు తీసుకువెళ్తారు దీని వల్ల వాళ్లకు అవసరమైన ఆర్థిక విధానాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల పత్రికకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. మీడియా కార్పొరేటీకరణ అయితే, వ్యక్తిపూజ, లేదా స్వలాభం కోసం వార్తలు రాసి ప్రజల సమస్యలపై వార్తలు రాసే అవకాశం తగ్గిపోతుంది.