ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా దీదీ..?
అయితే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఒంటరిగా తన రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొని వరుసగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఈ విజయమే మమతా బెనర్జీని ప్రతిపక్షాల తరఫున నాయకత్వం వహించేస్థాయికి తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. దీంతో మమతా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ రెండుగా చీలి కొన్ని ఎన్డీయే సరసన ఉండగా, మరికొన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి గూటిలో చేరుతున్నాయి. ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న పార్టీలు కూడా 2024 ఎన్నికల నాటికి ఎటో ఒకవైపు చేరక తప్పని పరిస్థితి కనబడుతోంది.
అయితే దేశంలో 70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చతికిలపడిపోయింది. పేరుకే జాతీయ పార్టీ తప్ప ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తన మార్క్ను చూపెట్టలేకపోతుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో, రాహుల్ నాయకత్వంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.