పరాయి మహిళపై కోరిక.. చివరికి ఎంత వరకు దారి తీసిందంటే?

praveen
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాల పేరుతో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కట్టుకున్న వారిని కాదని వారిని మోసం చేస్తూ ఇక పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి చివరికి కుటుంబ బాధ్యతలను కూడా మర్చిపోతున్నారు ఎంతోమంది. అయితే ఇలా అక్రమ సంబంధాల కారణంగా ఎంతోమంది దారుణంగా హత్యకు గురవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే రోజురోజుకు ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నప్పటికీ ఎక్కడ ఏ మాత్రం ఎవ్వరిలో మార్పు రావడం లేదు.

 ఇలా అక్రమ సంబంధాలకు సంబంధించిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పరాయి మహిళపై పట్ల ఆ వ్యక్తికి ఉన్నా మోజు చివరికి ప్రాణం పోయేంతవరకు దారితీసింది. పరాయి మహిళతో అక్రమ సంబంధం చివరికి దారుణ హత్యకు గురయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది.ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మహా ముత్తారం మండలం నిమ్మ గూడెం లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే 32 ఏళ్ల వ్యక్తి కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఊర్లోకి వెళ్లిన అతను రాత్రి దాటినప్పటికీ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో పది నిమిషాల లో వస్తానని చెప్పి మరుసటి రోజు ఉదయం వరకు కూడా అతను రాలేదు.

 ఇక ఆ తర్వాత రోజు స్థానికులు ఊరి చివర్లో శవాన్ని గుర్తించారు. దగ్గరికి వెళ్లి చూడగా అది ప్రవీణ్ మృతదేహం అని నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. పదునైన ఆయుధంతో తల వెనుక ముందు భాగంలో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక డాగ్ స్క్వాడ్ ను రప్పించి పలు కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు. అయితే సదరు యువకుడు కొంతకాలం నుంచి  అదే గ్రామంలో ఉన్న ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని.. వారి బంధువులే ఇలా హత్య చేసి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: