రెండోసారి ప్రధానమంత్రి పగ్గాలు..!

NAGARJUNA NAKKA
ఇథియోపియాలో గత నెల ఎన్నికలు జరిగాయి. అక్కడ హోరాహోరీగా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అధికార ప్రాస్పెరిటీ పార్టీ సంచలన విజయాన్ని సాధించింది. ఇంకేముందీ రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్. మొత్తంగా 436సీట్లకు గాను 410సీట్లు ప్రాస్పెరిటీ పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఇథియోపియా జాతీయ ఎన్నికల బోర్డు అధికారికంగా ప్రకటించింది. అబీ అహ్మద్ 2018నుంచి ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు.    

అబీ అహ్మద్‌ అలీ 2018లో ఇథియోపియా నాలుగో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇథియోపియో-ఎరిట్రియా మధ్య ఎన్నో సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఆ సమస్యను పరిష్కరించడంలో అబీ అహ్మద్ అలీ విజయం సాధించారు. 2018లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే రోజే.. ఎరిట్రియా అధ్యక్షుడితో చర్చలు జరిపి వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. అంతేకాదు ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించేందుకు అడుగులు వేశారు.

ఎరిత్రియాలో శాంతి స్థాపనకు కృషి చేసిన అబీ అహ్మద్ ను నోబెల్ పురస్కారం వరించింది. 2019లో ఆయనకు ఆ గౌరవం దక్కింది. ఎరిత్రియా-ఇథియోపియా మధ్య సరిహద్దు అంశం వివాదానికి దారితీసింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. అలాంటి కండీషన్ లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబీ అహ్మద్.. ఆ దేశ అధ్యక్షుడితో సామరస్యంగా మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతేకాదు ఎరిత్రియాలో శాంతి మంత్రాన్ని పాటించేలా చేశారు. అదే ఆయనకు నోబెల్ రూపంలో గౌరవం తెచ్చిపెట్టింది.  1998వ సంవత్సరం నుండి 2000వ సంవత్సరం వరకు ఇథియోపియా-ఎరిత్రియా మధ్య యుద్ధాలు జరిగాయి. ఎన్నో సంవత్సరాలు శత్రువులుగా కొనసాగిన దేశాలు అబీ అహ్మద్ చర్చలతో మిత్ర దేశాలుగా మారాయి. 2019లో నోబెల్ పురస్కారం అందుకున్న ఇథియేపియా ప్రధాని అబీ అహ్మద్ కు.. 9లక్షల అమెరికా డాలర్ల నగదు కూడా లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: