కొండెక్కిన కోడి కూర.. వారంలోనే భారీగా పెంపు..!

N.ANJI
చికెన్‌ ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోయింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దాంతో చాలా మంది చికెన్‌ తినేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దీని ధర అమాంతం పెరిగిపోయాయి. ఇక వారం రోజుల వ్యవధిలో కిలోపై వంద రూపాయలకు పైగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది చికెన్‌ కొనేందుకు భయపడుతున్నారు. అయితే ఈ నెల నాలుగో తేదీ ఆదివారం కిలో రూ.285 ఉండగా.. తాజాగా మంగళవారం మరో రూ. 15 పెరిగి రూ. 300 చేరింది.
అయితే నిత్యావసరాల సరుకుల ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ఉండగా.. చికెన్, గుడ్లు ధరలు కట్టడి చేసే అధికారం మాత్రం వీరి చేతుల్లో లేదని చెప్పారు. దానిని ఆసరాగా  చేసుకొని కొంతమంది వ్యాప్యారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినపడుతున్నాయి.
ఇక మార్కెట్‌లో చికెన్‌కు డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలో బ్రాయిలర్‌ అసోసియేషన్‌ ధర నిర్ణయిస్తుంది. అయితే గుడ్ల ధరలను నేషనల్‌ ఎగ్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. వీరంతా ప్రైవేటు వ్యక్తులు కావడంతో తమకు నచ్చినప్పుడు ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఇటీవల కాలంలో మాంసం ప్రియులు పెరగడంతో దాన్ని అదునుగా చేసుకొని ధరలు పెంచుతున్నారు. అయితే కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరత సృష్టించి డిమాండ్‌ పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి..
అంతేకాదు.. హోల్‌సేల్‌ వ్యాపారులకు బాగానే ఉన్నా రిటైల్‌ అమ్మకందారులు మాత్రం కస్టమర్లకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకున్నట్లు తెలిపారు. ఇక ధరలు పెంచడంతో కిలో కొనుగోలు చేసేవారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు జనాలు. అయితే జిల్లాలో రోజుకి లక్ష కేజీల చికెన్‌ అవసరం ఉంటుందన్నారు. ఇక సుమారు ప్రస్తుతమున్న ధర ప్రకారం రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. జిల్లా వాసులకు రోజుకి ఎనిమిది లక్షల గుడ్లు అవసరం ఉంటుంది. ఇక జిల్లాలో సుమారు ఆరు లక్షల వరకు ఉత్పత్తి జరుగుతుంది. అయితే మిగిలిన వాటిని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: