ఆ 22 మంది మరణం వెనుక కుట్ర ఉందా..?!
ఈ వీడియోలో డైరెక్టర్ ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి మొత్తం 22 మంది చనిపోయారని ధ్రువీకరించారు కూడా. ఇందుకు సంబంధించి మొత్తం సంభాషణ ఏప్రిల్ 26 - 27న బయటపడిన ఆక్సిజన్ సంక్షోభం సమయంలోనిది. నగరంలోని పారస్ ఆస్పత్రిలో గత నెల 26 ఉదయం 7 గంటలకు మాక్ డ్రిల్ జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 96 కోవిడ్ రోగులు అడ్మిట్ అయ్యారు. ఈ సంఘటన మాక్ డ్రిల్ తర్వాత వారిలో 74 మందే ప్రాణాలతో మిగిలారు అని తెలిపారు.
ఆగ్రా నగరంలోని పారస్ ఆస్పత్రిలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అరింజయ్ జైన్ కు సంబంధించి మొత్తం 4 వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అందులో ఆయన తమకు ఆక్సిజన్ సంక్షోభం ఎదురైన రోజు గురించి తెలిపారు. కాకపోతే స్థానిక మీడియాతో మాట్లాడిన ఆస్పత్రి డైరెక్టర్ అరింజయ్ జైన్ సంబంధిచి ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని ఆయన ఆరోపించారు.