ఆ 22 మంది మరణం వెనుక కుట్ర ఉందా..?!

Suma Kallamadi
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో ఉన్న ఒక ఆస్పత్రి డైరెక్టర్ సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు డైరెక్టర్ " ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. రోగులను తీసుకెళ్లిపోవాలని తాము వారి బంధువులకు చెప్పామని.. కానీ, దానికి ఎవరూ ఒప్పుకోవడం లేదని., అందుకే, తాను ఒక మాక్ డ్రిల్‌ లాంటి ప్రయోగం చేశానని తెలిపాడు. గతనెల 26న ఉదయం 7 గంటలకు తాము ఆక్సిజన్ సరఫరా ఆపేశామని.. దానితో 22 మంది కరోనా రోగులు ఊపిరాడక తల్లడిల్లి, వాళ్ల శరీరం నీలంగా మారిందని తెలిపాడు. ఆ సమయంలో వారికి ఆక్సిజన్ సరఫరా లేకుంటే వాళ్లు బతకరని అర్థమైందని.. దాంతో తాము ఐసీయూ లోని మిగతా 74 మంది రోగుల బంధువులతో మీ ఆక్సిజన్ సిలిండర్లు మీరే తెచ్చుకోవాలని చెప్పినట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలో డైరెక్టర్ ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి మొత్తం 22 మంది చనిపోయారని ధ్రువీకరించారు కూడా. ఇందుకు సంబంధించి మొత్తం సంభాషణ ఏప్రిల్ 26 - 27న బయటపడిన ఆక్సిజన్ సంక్షోభం సమయంలోనిది. నగరంలోని పారస్ ఆస్పత్రిలో గత నెల 26 ఉదయం 7 గంటలకు మాక్ డ్రిల్ జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 96 కోవిడ్ రోగులు అడ్మిట్ అయ్యారు. ఈ సంఘటన మాక్ డ్రిల్ తర్వాత వారిలో 74 మందే ప్రాణాలతో మిగిలారు అని తెలిపారు.

ఆగ్రా నగరంలోని పారస్ ఆస్పత్రిలో ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అరింజయ్ జైన్‌ కు సంబంధించి మొత్తం 4 వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అందులో ఆయన తమకు ఆక్సిజన్ సంక్షోభం ఎదురైన రోజు గురించి తెలిపారు. కాకపోతే స్థానిక మీడియాతో మాట్లాడిన ఆస్పత్రి డైరెక్టర్ అరింజయ్ జైన్ సంబంధిచి ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని ఆయన ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: