సూపర్ గురు.. వీధి కుక్కలకు చికెన్‌ బిర్యానీ..!

N.ANJI
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు పలు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తరుణంలో ప్రజలు జీవనోపాధిని కోల్పోయి ఆర్థికంగాను తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఇక ఈ క్లిష్ట సమయంలో సొంతవారు కూడా పరాయి వాళ్ళలా చూస్తున్నారు. మరికొంత మంది మాత్రం తోటివారికి సహాయం చేస్తూ మానవత్వానికి మరో పేరులా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సుమారు 200 వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నాడు. అది కూడా చికెన్‌ బిరియానితో వాటి కడుపు నింపడం విశేషం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రంజీత్ నాథ్ రోజూ దాదాపు 40 కిలోల బిర్యానీ వండుకుని నగరంలోని పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఆహారాన్ని అందిస్తున్నాడు. లాక్‌డౌన్ మొదలయిన తర్వాత జంతువులకు ఆహారం దొర‍కడం కష్టమైంది. వాటిని చూసి ఎంతో చలించిపోయారు రంజిత్. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే నాగ్‌పూర్‌లో వీధి కుక్కలు, పిల్లులకు ప్రతి రోజు అన్నం పెట్టేందుకు ముందుకొచ్చారు. అలా అప్పటి నుంచి ప్రతి రోజు దాదాపు 200 వరకు వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు. అయితే రంజిత్‌ ఓ పత్రిక సంస్థతో మాట్లాడుతూ.. నేను ఈ కుక్కల కోసం ప్రతీ రోజు 30-40 కిలోల చికెన్‌ బిర్యానీని సిద్ధం చేసుకుంటాను. వీధి జంతువులను నా పిల్లల్లాగే భావిస్తాను. నేను జీవించి ఉన్నంత వరకు ఈ పని చేస్తుంటాను. పైగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపాడు. నా పని మధ్యాహ్నం వంటతో మొదలై.. ఇలా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు బైక్ మీద నగరం చుట్టూ తిరిగి పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు భోజనం పెట్టి వాటి ఆకలిని తీర్చడంతో నా పని పూర్తి అవుతుందని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: