శభాష్... రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమం

Gullapally Rajesh
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఎం.పీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రోజు కరోనా బాధితులకు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు... ఈ కార్యక్రమం మొదలుపెట్టామని అన్నారు. లాక్ డౌన్ కారణంగా పేషంట్స్  కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదు అని అన్నారు. ఫస్ట్ వేవ్ లో కూడా ప్రభుత్వాలు కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదు అని ఆయన ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ తరపున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు.
యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారు విచారణ పేరిట అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. గాంధీ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ అయినా... కనీస సౌకర్యాలు లేవు ఎవరి దగ్గర డబ్బులు లేవు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. డాక్టర్, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదు అని ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నాం అని ఆయన అన్నారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తాం..5 రూపాయలకే భోజనం .. కాంగ్రెస్ స్టార్ట్ చేసింది అని అన్నారు.
ఈ టైం లో కూడా ప్రభుత్వం భోజనం ఏర్పాటు చెయ్యలేదు అని ఆయన విమర్శలు చేసారు. డాక్టర్స్, నర్సులు, సిబ్బంది, పేషంట్స్, వారి బంధువులకు 1000 మందికి భోజనం ఏర్పాటు చేసామని వివరించారు. ఈ రోజు రేపు వ్యాక్సిన్ బంద్, సెకండ్ డోస్ అందించడానికి వ్యాక్సిన్ లేదు అని అన్నారు. వ్యాక్సిన్ లేక ఇలా డోసుల వ్యవధి పెంచుతున్నారని మండిపడ్డారు. టిమ్స్ లో 8 వ ఫ్లోర్ తరువాత ఆక్సిజన్ అందడం లేదు అని మండిపడ్డారు. బెడ్స్ కొరత, ఆక్సిజన్ , రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఉంది అన్నారు.  సిగ్గు లేకుండా వసూళ్ల కోసం .. ప్రగతి భవన్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం అయ్యింది... అవసరమయిన సమస్యలను చర్చించలేదు అని మండిపడ్డారు. ఒక గర్భిణీ వైద్యం అందక చనిపోయింది... స్మశాన సిబ్బంది కూడా తల్లిని బిడ్డను వేరు చేస్తేనే దహనం అన్నారు అని ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస సౌకర్యాలు లేవు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: