యువతిపై అత్యాచారం.. తర్వాత పోలీసులు, లాయర్లు కలిసి జైల్లోనే..?
వెరసి ఈ సృష్టికి మూలమైన ఆడపిల్ల ప్రతి క్షణం ప్రతి రోజు అడుగడుగునా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కామాంధులు బారినపడి జీవితం బలవుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూన్నాయి న్యాయస్థానాలు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అత్యాచారం కేసులో నిందితుడైన బాధితురాలికి ఇచ్చి పెళ్లి చేసారు. ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది.
ఒడిశాకు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఇటీవలే ఓ బాలికపై అత్యాచారం చేయగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను కొన్ని రోజుల నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అతను బెయిల్ కోసం అర్జీ పెట్టుకోగా అత్యాచారం చేసిన బాధితురాలిని పెళ్లి చేసుకుంటేనే బెయిల్ మంజూరు చేస్తామని పొక్సో కోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ మధ్యనే 18 ఏళ్లు నిండిన ఆ బాధితురాలికి పోలీసులు లాయర్ల మధ్య జైల్లోనే పెళ్లి జరిపించారు. కాగా ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.