ఇది నిజంగా ఇటు ఇండియాకు.. అటు చైనాకూ గుడ్ న్యూస్.. ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకూ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది.. కానీ.. కొన్ని రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలిస్తున్నాయి. ఇండియా చైనా మధ్య ఏడాదిన్నరగా ఘర్షణ వాతారవరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీ తలపడి ఇరువైపులా ప్రాణ నష్టం జరగడంతో ఈ ఘర్షణ మరింత ముదిరింది. ఆ తర్వాత అనేక చర్చల తర్వాత ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. పాంగ్యాంగ్ లోయలో ఫింగర్ 8 ప్రాంతానిక