బ్రాహ్మణ హత్యల పాపం కేసీఆర్ ను వదలదు...!

Gullapally Rajesh
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ పేరింటేనే కేసీఆర్ కు డప్పులు కొడుతోంది అని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ రాక్షస,గడీల పాలనకు అంతమొందించేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ బీజేపీ లోకి స్వాగతిస్తున్నాం అని ఆయన అన్నారు. తెలంగాణ లో నిద్ర లేని జీవులు ఇద్దరున్నారు.. ఒకరు కేసీఆర్, ఇంకొకరు కేటీఆర్ అని, కేటీఆర్ నిద్రలో లేచి సీఎం.. సీఎం అంటున్నాడు అని ఎద్దేవా చేసారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవరు అన్నారు...ఓవైసి అయ్య అన్నారా అని ప్రశ్నించారు.
రాజకీయ లబ్ది కోసం కేంద్ర పాలిత ప్రాంతం కాబోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఎవరికీ వ్యతిరేకం కాదు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న టిఆర్ ఎస్ కు మాట్లాడే అర్హత లేదు అని ఆయన స్పష్టం చేసారు. ఎప్పుడు లేనిది కేసీఆర్ కు  పీవీ నరసింహారావు గుర్తొచ్చారు అని ఎద్దేవా చేసారు.  పీవీ శతజయంతి ఉత్సవాల  పేరిట ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు అని అన్నారు. ఓడిపోయే ఎమ్మెల్సీ సీటును పీవీ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చారు అని విమర్శించారు.
గెలిచే దమ్ముంటే కేసీఆర్ ఒక చోట,కేటీఆర్ మరో చోట పోటీ చేయాలి అని డిమాండ్ చేసారు.  ఓడిపోయే సీటిచ్చి పీవీ ని అవమానించారు అన్నారు. అడ్వకేట్ దంపతుల హత్య జరిగితే వాళ్ళు మంచి వాళ్ళు కాదని ప్రచారం చేస్తున్నారు అని, జంట హత్యలపై సిబిఐ విచారణ కోరాలి అని డిమాండ్ చేసారు. పీవీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినంత మాత్రాన  బ్రహ్మాణ హత్యల పాపం ఊరికే పోదు అన్నారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు. కెసిఆర్ కు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలి,రెండేళ్లు ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడాలి,ఆ తర్వాత 5ఏళ్ళు మీకు రక్షణ గా మేముంటాము అని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: