శ్రీవారిని దర్శించుకున్నారు.. కానీ అంతలోనే నలుగురి ప్రాణాలు పోయాయి..?

praveen
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా పోతున్న ప్రాణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే. రోడ్డు నిబంధనలు పాటించక పోవడం అతివేగం వెరసి రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది రోడ్డు ప్రమాదాల కారణంగా జీవచ్ఛవాలుగా మారిపోయి జీవితాన్ని దుర్బరం చేసుకుంటూ ఉంటే ఇంకా ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడేలా చేసి ప్రాణాలు కోల్పోతున్నారు అయితే ప్రతి ఒక్కరూ  రోడ్డు. ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అని ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాహనదారుల తీరులో  మాత్రం మార్పు రావడంలేదు.

 కొన్ని కొన్ని సార్లు విధి చిన్నచూపు చూడటం తో వాహనదారులు సరైన మార్గంలోనే వెళ్లినప్పటికీ ఇతరులు చేసిన పొరపాటుతో  రోడ్డు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సినా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఇటీవల ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్టూరు జాతీయ రహదారి వద్ద ఈ ఘటన జరిగింది.  లారీ వెనుక నుంచికారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.


 అయితే అందరూ కూడా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుపతి వెళ్లి అక్కడ శ్రీవారిని దర్శించుకుని ఇక ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో దేవుడి దర్శనం దొరికింది అని ఆనంద పడుతున్న వారిని  అంతలోనే విధి చిన్న చూపు చూసి రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా నలుగురు మృతి చెందారు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: