బాబు మళ్లీ సీఎం అయ్యి ఉంటే...?

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్న బిజెపి ఒకపక్క టిడిపి, మరో పక్క వైసిపి పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే, తిరుపతి స్థానంలో గెలవాలనే ప్రయత్నాల్లో ఉంది. అక్కడ గెలిచి ఏపీలో తమకు పట్టు ఉందని నిరూపించుకునేందుకు గట్టిగానే కష్టపడుతోంది. తెలంగాణలో మాదిరిగా, ఏపీలోనూ బిజెపి తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. లేకపోతే రాష్ట్ర నాయకత్వంపై కేంద్ర బిజెపి ప్రజలకు నమ్మకం పోతుంది అనే అభిప్రాయంతో ఉన్న రాష్ట్ర పార్టీ నాయకులు వైసిపి, టిడిపి అనే తేడా లేకుండా విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.


 గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన బిజెపి, ప్రస్తుతం మాత్రం అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి జగన్, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  పార్టీల అధిపతులు, సీఎం లు, ప్రతిపక్ష నేతలు ఇలా అంతా రాయలసీమను ముంచేశారని, సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. అలాగే చంద్రబాబు పాలనలో జనం పెనం మీద ఉంటే, జగన్ పరిపాలనలో పొయ్యిలో పడ్డారని సెటైర్ వేశారు.



ఏపీలో టీడీపీ వైసీపీ శకం ముగిసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొరపాటున టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే, ప్రజలు మూడు రాజధానులు అడిగేవారు అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. బిజెపి డిక్లరేషన్ గురించి ద్రోహులైన బాబు , జగన్ కు మాట్లాడేందుకు అర్హత లేదని, బిజెపి డిక్లరేషన్ వల్లే జగన్ కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు అనే విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: