అక్కడ డాక్టర్ లు కుళ్ళు రాజకీయాలకు వైద్యం చేస్తారా..?
ఇకపోతే రాష్ట్రంలో వైసీపీ గెలిచిన అన్ని స్థానాలకు ఒక్కో స్పెషలిటీ ఉంది.. రాజకీయంగా అన్ని నియోజకవర్గాల్లో చాలామంది వివిధ వృత్తులనుంచి రాజకీయనాయకులుగా ఎదిగారు. అయితే కడప జిల్లాల్లో డాక్టర్లు రాజకీయ నాయకులుగా ఎదిగి ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నారు. కడప జిల్లా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో డాక్లర్లు ఎక్కువగా కనిపిస్తారు. వీరిలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఈ రాష్ట్రంలో సరికొత్త రికార్డును సృష్టించింది. రూపాయి డాక్టర్గా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో పేదల పెన్నిధిగా కూడా ఆయన పేరు గడించారు. ఫలితంగా అయన ముఖ్యమంత్రి అయ్యారు..
ఇదే జిల్లాకు చెందిన ఎంవీ మైసూరారెడ్డి కూడా డాక్టర్. ఈయన కూడా కాంగ్రెస్లోనే చక్రం తిప్పారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు కైవసం చేసుకున్న డీఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కసిరెడ్డి మధుసూదన్రెడ్డి, ఎంవీ.రమణారెడ్డి కూడా పూర్వాశ్రమంలో వైద్యులుగా ప్రజలకు సేవలందించారు.ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్రెడ్డి సైతం వైద్యుడే. ఇలా డాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చి మంచి రాజకీయాలు చేయడానికి తమదైన వైద్యం చేస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలనుంచి ఇక్కడ వారిదే పైచేయి అంటే డాక్టర్ లంటే అక్కడి ప్రజలకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది..