రేపటి భారత్ బంద్ కు కేసీఆర్ సపోర్ట్ ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏంటి..?

P.Nishanth Kumar
ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు విషయంలో మోడీపై పెద్ద ఎత్తున ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆగ్రహం కాస్త నిరసన గా మారిపోయింది.. దేశంలోని మూల మూలలనుంచి ప్రజలు దేశం నడిబొడ్డు కి చేరుకొని రోడ్లమీద ఆందోళన చేస్తుంది.. తక్షణమే వ్యవసాయ బిల్లుని రద్దు చేయాలనీ వారు డిమాండ్ చేస్తుండగా కేంద్రం ఇప్పుడు దానిపై కస రత్తులు చేస్తుంది. ఢిల్లీ లో ఇప్పటికే వందల కొలది రైతులు వచ్చి ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో పాటు ఈనెల 8 వ తేదీన అంటే రేపు భారత్ బంద్ కి పిలుపు నిచ్చింది..
ఈ బంద్ కి దేశంలోని చాల పార్టీ లు సముఖత తెలియపరచగా కేసీఆర్ కూడా పూర్తి సంఘీభావం చేస్తున్నట్లు ప్రకటించాడు.. అయితే కేసీఆర్ ఈ బంద్ కి ఒప్పుకోవడంతో బీజేపీ పై అయన చేస్తున్న పోరాటానికి మొదటి అడుగు వేసినట్లు అయ్యింది.. అయన ఈ బిల్లు ఆమోదం పొందినప్పటినుంచే వ్యతిరేకంగా ఉన్నారు. ఈ బిల్లు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా, రైతులకు ప్రతికూలంగా ఉందని మొత్తుకున్నారు. అయితే అయన వాదన ఇలా ప్రజల రూపంలో బయటపడగా ఈ ఇష్యూ తో మోడీ కావాల్సినంత డ్యామేజ్ చేయాలనీ భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలందరూ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటీవలే కేంద్రంతో చర్చలు ఆశాజనకంగా సాగకపోవడంతో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. భారత్ బంద్‌ చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం.. కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ బంద్‌కు మద్దతు పలుకుతున్నాయి. అయితే ప్రత్యక్షంగా పాల్గొనడంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ప్రధానంగా పంజాబ్, హర్యానాకు చెందిన వారు.  ఇక కేసీఆర్ తెలంగాణ లో బలపడుతున్న బీజేపీ ని నీరుగారి ప్రయత్నమే ఇది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: