
కరోనా వైరస్ కేసుల తగ్గింపు విషయంలో ఎవరు అందుకోలేని ఘనత అందుకున్న జగన్....
అలాగే కరోనా మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. శనివారం కరోన వైరస్ బారిన పడి ఏడుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు కరోనాతో చనిపోవడం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,988కు చేరింది.
అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు ఆదివారం భారీగా జరిగాయి. ఇటీవలి కాలంలో డిశ్చార్జిలు ఇంత భారీ సంఖ్యలో నమోదు కావడం మొదటిసారి కావడం విశేషం. ఆదివారం 3,787 మంది కోవిడ్ 19 నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,52,298 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,397కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,00,17,126 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంకా ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...