ఏపీలో ఇప్పుడు ఉద్యోగులు కాస్త నిరసన మార్గాల ద్వారా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారని అర్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి గానూ ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాల ద్వారా అడుగులు వేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ ఉద్యోగుల నేత ఒకరు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆస్కార్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్న రాయితీలను ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇక ఐదు డీయేలు పెండింగ్ ఉన్నాయి వాటిని అమలు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు.