రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు.. మరికొన్ని రోజుల్లో..?
అయితే ఇటీవలే ఈ టోర్నీలో కూడా రోహిత్ సారథ్యంలో ఆటలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచడంతో ముంబై ఇండియన్స్ జట్టు ఐదవసారి టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది మొదట ఐపీఎల్లో తొడ కండరాలు పట్టేయడం తో గాయం కారణంతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో సెలెక్ట్ చేయలేదు బిసిసిఐ సెలెక్టర్లు. దీంతో బీసీసీఐ పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఐపీఎల్లో రోహిత్ శర్మ మ్యాచ్ ఆడిన తర్వాత కూడా ఎందుకు ఇంకా గాయం ఉందనే కారణాలు చెబుతున్నారు అంటూ విమర్శలు రాగా ఎట్టకేలకు బిసిసిఐ మెత్తబడింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మను ఎంపిక చేస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు రోహిత్ శర్మ. పూర్తిగా గాయం నుంచి కోరుకున్నానని చెబుతున్నప్పటికీ బీసీసీఐ మాత్రం గాయం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం కావాలని కోరింది. దీంతో ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ టెస్ట్ చేయించుకున్నాడు రోహిత్ శర్మ. కాగా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు.