భార్యపై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా..?

praveen
భార్య భర్తల మధ్య నమ్మకం అనేది పునాది లాంటిది అనే విషయం తెలిసిందే.  ఒక ఇల్లు కు పునాది సరిగా లేకపోతే భవనం ఎలా నిలవదో  భార్య భర్తల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే ఎక్కువ రోజులు భార్య భర్తల బంధం కొనసాగలేదు. ఈ మధ్య కాలంలో అయితే ఒకరిపై ఒకరు అనుమానం రోజురోజుకు పెరిగిపోతున్న దారుణ ఘటన వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన వారే కట్టుకున్న వాళ్లని దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి.

 కట్టుకున్నవారు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని అనుమానం ఏకంగా  దారుణాలకు దారితీస్తోంది. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ  ఒక వ్యక్తికి భార్యపై అనుమానం రోజురోజుకు పెరిగిపోయింది. దీంతో అనుమానంతో ఘాతుకానికి పాల్పడ్డాడు భర్త. భార్య నిద్రిస్తున్న సమయంలో కత్తితో కిరాతకంగా గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుంటూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం తూర్పు రేకుల కుంట లో జరిగింది ఈ దారుణ ఘటన.

 గ్రామానికి చెందిన రమేష్ ఈ మధ్యకాలంలో మద్యానికి బానిస గా మారిపోయాడు. ఈ క్రమంలోనే  తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు రమేష్. ఏదో ఒక విషయంలో భార్యను తప్పు పడుతూ మాట్లాడుతూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఇటీవల ఇదే విషయంపై దంపతుల మధ్య మరోమారు గొడవ జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిపోయిన భర్త రమేష్ ఏకంగా భార్య నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోశాడు వెంటనే అప్రమత్తమైన బాధితురాలు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు  భర్త నుంచి కాపాడి అంబులెన్స్ లో  ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: