అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ప్రధాని మోదీ VS పాకిస్థాన్
భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉండటం వల్ల.. భారతీయులు, పాకిస్తానీయులు ఘర్షణపడుతుంటారని భావిస్తుంటారు. కానీ అమెరికాలో ఈ రెండు దేశాల ప్రజలు ఒకే దేశానికి చెందిన వారి లాగా కలిసి మెలసి ఉంటారు. అంతేకాకుండా వీరు తరచూ రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే అమెరికన్ భారతీయ పాకిస్థానీలు గతంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు మద్దతు పలికారు. ఈయన గెలిస్తే అమెరికాలో మరింత న్యాయం మరియు సమానత్వం ఉంటుందని భావించడమే కారణం. గతంలో భారత్ మరియు పాకిస్తాను లు విడిపోవడానికి కారణమయిన ఏ విషయం గురించి ఎప్పుడూ వీరు ఇరువురు చర్చించరట. దీనితో వీరి మధ్య ఎటువంటి విభేదాలకు తావులేకుండా వీరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయినప్పటి నుంచీ.. ఇక్కడ మైనారిటీల వ్యతిరేక, జాతివివక్ష వాదనలు పెరిగాయని ఆయన విమర్శకులు అంటారు. ''ద్వేషం, వివక్ష, వలస వ్యతిరేక మనోభావాలు పెరగటంలో'' ట్రంప్ బాధ్యత ఉందని సయ్యద్ ఏకీభవిస్తారు. మరి ఇప్పుడు ప్రధాని మద్దతు ట్రంప్ ని గెలిపిస్తుందా ...లేదా అమెరికన్ భారతీయ మరియు పాకిస్థానీల సంబంధాలు జో బైడెన్ ని అధ్యక్షుడిని చేయనున్నాయా...