జగన్ సర్కార్ పై కోర్టుకెక్కిన ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్...
ఎన్నికల సంఘం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకుని వెంటనే నిధులు విడుదలయ్యేలా చూడాలని హైకోర్టును నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కే) ప్రకారం ఎన్నికల కమిషన్కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున సీతారామమూర్తి, అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు.