జగన్ ఐడియా.. అదిరిపోయిందిగా.. అంతటా ప్రశంసలు..!?

Chakravarthi Kalyan
జగన్ సీఎం కుర్చీ ఎక్కగానే ప్రభుత్వపథకాలను సమర్థవంతంగా ప్రజలకు అందించే వ్యవస్థ కోసం ప్రయత్నించారు. అందులో భాగంగానే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. అనేక పథకాలను గ్రామస్తుల ముంగిటకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. గ్రామస్తుల తలలో నాలుకగా ఉంటోంది. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ వారికే లబ్ధి చేకూరితే , వలంటీర్లు, గ్రామసచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలందరికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సేవలు అందిస్తోందన్న టాక్ గ్రామాల్లో వినిపిస్తోంది.


రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత వంటి..ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ సర్కారు గ్రామవాలంటీర్ల ద్వారానే అందజేస్తోంది. తాజాగా  వైఎస్సార్‌ చేయూత ద్వారా 25లక్షలమంది మహిళలకు లబ్ది చేకూర్చారు. కరోనా సమయంలోనూ గ్రామ వాలంటీర్ల సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామాల్లోని కరోనా పేషెంట్ల వివరాలు సకాలంలో సక్రమంగా ప్రభుత్వానికి అందడంలో ఈ గ్రామ వాలంటీర్లు అందించిన సేవలపై ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి.



కరోనా సమయంలోనూ వీరు ఆపదను లెక్క చేయకుండా కరోనా రోగుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతున్నారు. మందులు అందిస్తున్నారు. కరోనా వైద్య సేవలను సమన్వయ పరచుకుంటున్నారు. అందుకే ఇటీవల సీఎం జగన్ సైతం.. వలంటీర్ వ్యవ‌స్థను చూసి గ‌ర్విస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు.  వలంటీర్ల వ్యవ‌స్థ ఏర్పడి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా వ‌లంటీర్ల వ్యవ‌స్థను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రశంసించారు.


అవినీతి ర‌హిత ప‌రిపాల‌న కోసం, అర్హత క‌లిగిన వారంద‌రికీ ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాలు వారి ఇంటి గుమ్మం ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామ వ‌లంటీర్ల వ్య‌వ‌స్థను సంవ‌త్సరం క్రితం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కూల ప‌రిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆకాంక్షల మేర‌కు అద్బుత‌మైన సేవ‌లందిస్తున్న వలంటీర్ వ్యవ‌స్థను చూసి గ‌ర్విస్తున్నానని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మెచ్చుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: