మానవత్వం మాయం చేసిన కరోనా.. అతన్ని చంపేసింది..?

praveen
చైనా నుంచి వచ్చిన మాయదారి కరోనా  వైరస్ మనిషిలో మానవత్వాన్ని మాయం చేసి భయాన్ని పెంచుతుంది. ప్రస్తుతం జాలి దయ ఉన్న మనిషి మచ్చుకైనా కనిపించడం... మనిషి జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి  మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తుంది. ప్రాణాలు పోతున్నా కనీసం దయ చూపని కఠినత్వాన్ని తీసుకొచ్చింది. ప్రాణాలు పోతుంటే అయ్యో పాపం అని  సహాయం చేయకుండా... సహాయం చేస్తే ఎక్కడ మన ప్రాణాలమీదికి వస్తుందో అనే పరిస్థితిని తీసుకొచ్చింది కరోనా రక్కసి, శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న ఈ మాయదారి వైరస్... కొంతమందిని నిస్సహాయులను చేసి చంపేస్తుంది. ఇలా మనుషుల్లో మానవత్వం మాయమైపోయింది అనేదానికి నిలువుటద్దంగా ఎన్నో ఘటనలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే.



 ఒక వ్యక్తి లో కరోనా లక్షణాలు ఉంటే చాలు ఆ వ్యక్తి ప్రాణాలు పోతున్నా ఆమడ దూరంలో నిల్చుని సినిమా చూసినట్లు చూస్తున్నారు కానీ సహాయం చేసేందుకు మాత్రం ముందుకు రావటం లేదు. ప్రస్తుతం తోటి మనిషినే  మనిషికి  శత్రువుగా మార్చేసింది ఈ కరోనా . తాజాగా జరిగిన ఘటనతో  మనుషుల్లో మానవత్వం మాయమైపోయింది అన్నది మరో సారి  నిరూపితమైంది. కరోనా  రోగి మంచం కింద పడి లేవలేని స్థితిలో ప్రాణాపాయంలో విలవిలలాడుతున్న.. ఎవరు సహాయం చేయలేదు చివరికి.. విలవిలలాడుతూనే ప్రాణాలు వదిలాడు సదరు వ్యక్తి. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది ఈ ఘటన.



 గంగాధర మండలం వెంకటం పల్లి కి చెందిన 70 ఏళ్ల వ్యక్తి కరోనా  సోకడంతో ఐదు రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆయన పరిస్థితి విషమించింది. దీంతో మంచం మీద నుంచి కిందపడ్డాడు. 15 నిమిషాల పాటు గిలగిల కొట్టుకున్నాడు. ఇక పక్కనే ఉన్న వారు ఇది చూస్తూ ఉండిపోయారు కానీ సహాయం చేయడానికి మాత్రం ముందుకు రాలేదు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో.. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలాడు ఆవ్యక్తి.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: