భర్తను హత్య చేసి.. కరోనా బూచి చూపించింది.. తర్వాత..
ఈ మద్య దేశంలో అక్రమ సంబంధాలతో కట్టుకున్న భర్తను భార్య.. భార్యను భర్త చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మద్య వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా చంపేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. ప్రియుడి మోజుల పడ్డ వివాహిత తన భర్తను చంపి కోవిడ్ 19 తో చనిపోయాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.. కానీ కోవిడ్ లక్షణాలు ఏవీ కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానాలు వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ఎంక్వెయిరీ చేయడంతో అసలు నిజాలు బయట పడ్డాయి. ఒడిశాకు చెందిన శరత్దాస్(45), అనితదాస్(35)ను గత 15 పదేండ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వీరు నోయిడాలో అనిత బంధువులతో కలిసి నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న సంజయ్(32)తో అనిత వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అనిత అక్రమ సంబంధం విషయం శరత్ కి తెలియడంతో ఆమెను గట్టిగా మందలించాడు. ఇక భర్తను చంపేయడానికి పక్కా ప్లాన్ వేశారు ఇద్దరు. ప్రస్తుతం కరోనా వైరస్ బూచీ చెప్పి ఆ కేసు నుంచి తప్పించుకోవాలన్న ప్లాన్ కూడా వేశారు. రాత్రి శరత్ గాఢ నిద్రలో ఉండగా అనిత సంజయ్ను పిలిపించి ఇద్దరు కలిసి దుప్పటితో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం చుట్టుపక్కల వారిని కరోనాతో మృతిచెందినట్లు నమ్మించగా బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు అనితను పిలిచి విచారించగా తన భర్త కరోనా సోకి చనిపోయాడని పొంతనలేని సమాధానం చెబుతోంది. ఇక శరత్ గత కొంత కాలంగా ఎనాడూ అనారోగ్యంతో లేరని.. ఉన్నట్టుండి కరోనా రావడం ఏంటని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. అసలు నిజాలు బయట పడ్డాయి. మే 4 న ఆవ్యక్తి పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా ధృవీకరించబడడంతో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. అనితను అదుపులోకి తీసుకొని మరోసారి ప్రశ్నించగా తానే సంజయ్తో కలిసి హత్య చేసినట్లు నేరం ఒప్పుకుందని ఆర్య పేర్కొన్నారు.