మరో 15 వేల కోట్లు అప్పుకు సిద్ధంగా తెలంగాణ సర్కార్...ఎఫ్.ఆర్.బి.ఎం లో మార్పులు..?
లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా రేషన్ , నగదు అందించింది. ఇప్పుడు ప్రభుత్వ ఖజానా తిరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అప్పులు చేయడమే దారి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్డౌన్ విధించడం వల్ల ఈ ఏడాది రాష్ర్టానికి రావాల్సినంత ఆదాయం రాలేదు. మరోవైపు రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం కోత విధించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో.. జీఎస్డీపీలో రెండు శాతం అదనపు రుణాన్ని పొందే సదుపాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం వరకు కల్పించింది. ఇందుకు తెలంగాణ ఎఫ్ఆర్బీ చట్టం, 2005కు అవసరమైన సవరణలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ మేరకు ఎఫ్.ఆర్.బి చట్టం లో మార్పులు చేసి మరో రెండు శాతం అప్పులు తెచ్చుకునేలా సవరణలు జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తరఫున న్యాయశాఖ కార్యదర్శి ఏ సంతోష్రెడ్డి గెజిట్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అదనంగా రెండు శాతం రుణం తెచ్చుకోవడానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ ఎఫ్.ఆర్.బి చట్టం మార్పు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం మరో రూ.15వేల కోట్ల వరకు అదనపు రుణం తెచ్చుకొనే అవకాశం కలుగుతుంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు ఉచిత బియ్యం, నగదు పంపిణీ, వలస కార్మికులకు రైళ్లు వంటి ఉపశమన చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 1,435 కోట్ల రూపాయలను అదనంగా అప్పు తెచ్చుకున్నారు. ఇప్పుడు కరోనా వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరిగే పరిస్థితి కనబడడం లేదు ఈ సమయంలో అప్పులు తెచ్చి రాష్ట్ర ఆదాయాన్ని చూపించాలి. ఈ మేరకు ప్రభుత్వం ఆర్థిక చట్టాల్లో సవరణలు చేయలాని ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ప్రయత్నం సఫలం అయితే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు మరో 15 వేళా కోట్ల రూపాయలు రుణం అందుంతుంది. కరోనా లాంటి విపత్కర సమయాల్లో అది ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.Powered by Froala Editor