ఏపీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం.. !

NAGARJUNA NAKKA

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న 500కు పైగా కేసులు రాగా.. ఈ రోజు పాజిటివ్ వచ్చినవారి సంఖ్య 600 దాటింది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 11,489కు పెరిగింది. గడిచిన 24గంటల్లో ఏపీలో 10 మంది కరోనాతో మృతిచెందారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 605 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 35 కేసులు ఉండగా..  రాష్ట్రంలో 570 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 11,489 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందినవారి కేసులు 9,353 ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి 1764, ఇతర దేశాల నుంచి వచ్చిన 372 మందికి కరోనా నిర్థారణ అయింది. ఏపీలో గత 24 గంటల్లో 22,305 మంది నమూనాలను పరీక్షించారు. 

 

కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో  కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలులో నలుగురు,  గుంటూరు, {{RelevantDataTitle}}