తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్.. !
తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతిరోజూ వందకు పైగా కేసుల నమోదు అవుతూ ఉండటంతో అలజడి రేగుతోంది. ఏక్షణాన ఎవరికి సోకుతుందో... పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం కావడం లేదు. లాక్డౌన్ సడలింపులే దీనికి కారణమా? లేక మరేదైనా ఉందా అన్నది అంతుచిక్కడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పడగ విప్పి బుసలు కొడుతోంది. నీడలా వెంటాడుతున్న కరోనా... తెలుగు రాష్ట్రాలను వదలడం లేదు. అంతకంతకూ కేసులు పెరుగుతున్నాయి. తాజా లెక్కలు చూస్తే... తెలంగాణలో కొత్తగా 143 కేసులు బయటపడ్డాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 116 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3వేల 290కి చేరింది. 24 గంటల్లో వైరస్కు మరో 8 మంది బలైపోగా మొత్తం మృతుల సంఖ్య 113కు చేరింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. {{RelevantDataTitle}}