నాలుగో దశ లాక్ డౌన్ లో భాగంగా దేశంలో దాదాపు గా అన్ని మినహాయింపులు ఇవ్వడంతో చాలా రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి కాగా కేరళ లో మాత్రం ఈరోజు స్వల్పంగా 12పాజిటివ్ కేసులు నమోదు కాగా అన్ని కూడా విదేశాల నుండి వచ్చిన వారివే కావడం గమనార్హం. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రం లో ఇప్పటివరకు 642కేసులు నమోదు కాగా అందులో 497 కోలుకొని ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 142 కేసులు యాక్టీవ్ గా వున్నాయి అయితే 10 రోజుల ముందు వరకు ఆ రాష్ట్రంలో కేవలం 16యాక్టీవ్ కేసులు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య మూడంకెలకు
చేరింది.
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా తమిళనాడు లో ఈ ఒక్క రోజే కొత్తగా 688 కేసులు నమోదుకాగా ఆంద్రప్రదేశ్ లో 57 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ లో ఈ రోజు కొత్తగా 42కేసులు నమోదు కాగా నలుగురు మరణించారు. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 1634 కు చేరగా అందులో 1011 కోలుకొని 38మంది మరణించారు. ప్రస్తుతం 585 కేసులు యాక్టీవ్ గా వున్నాయి.