కరోనా ఎఫెక్ట్ : మక్కా, మదీనాల్లో 24 గంటల కర్ప్యూ !
చైనాలోని పుహాన్ లో దుర్మూహూర్తంలో కరోనా వైరస్ పుట్టుకొచ్చిందో కానీ ఏ దేశాన్ని వదలడం లేదు. ఈ దేశం.. ఆదేశం అనే భేదం లేకుండా అన్ని దేశాల్లో విస్తరిస్తుంది. ముస్లింలకు అత్యంత ప్రధానమైన సౌదీ అరేబియా కూడా ఈ మహమ్మారి దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలైన మక్కా, మదీనాలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మక్కా, మదీనా ప్రాంతాల్లో తిరిగే కార్లలో ఒకే వ్యక్తి మాత్రమే ప్రయాణం చేయాలని స్పష్టం చేసింది.
ఈ ప్రాంతాల్లో తిరిగే కార్లలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించాలని ఆదేశించింది. సౌదీలో ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 20 మందికి పైగా మరణించారు. దీంతో, కరోనాను కట్టడి చేసేందుకు ఆ దేశం లాక్ డౌన్ విధించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో మక్కా, మదీనాకు వచ్చేవాళ్లు ఎలాంటి బుకింగ్స్ చేసుకోవద్దని ఇప్పటికే సౌదీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఒక్క అమెరికాలోనే 2,45,193 పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరిని భయపెడుతున్నది. గత 24 గంటలో 1169 మరణాలు సంభవించడంతో అమెరికన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ ఇలా మరికొన్ని దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తుంది కరోనా మహమ్మారి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple