పులివెందుల పులి ముందు టీడీపీ పరారైందా... ఇంత ఘోర అవమానమా...!
ఇటీవల ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ సతీష్రెడ్డి సైతం చంద్రబాబుకే నేరుగా ఇదే విషయం చెప్పారని అంటున్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే బాబు డైరెక్షన్లోనే సతీష్రెడ్డి ఈ ప్రకటన చేశారని కూడా టాక్ వచ్చింది. అసలు గత ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు చాలా వేషాలు వేశారు. పులివెందులకు నీళ్లు ఇచ్చామని.. ఎన్నికల్లో పులివెందులలో సైకిల్ పార్టీ దూసుకు పోతుందని సవాళ్లు రువ్వారు. యేడాది తర్వాత కట్ చేస్తే ఇప్పుడు అదే నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి.
అసలు సతీష్రెడ్డి సైతం ఎన్ని రోజులు పార్టీలో ఉంటాడో ? తెలియని పరిస్థితి. పులివెందులను పక్కన పెట్టేస్తే ఏపీలో చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జ్ల్లో కొందరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి రెడీ కావడం లేదు. మరికొందరు పోటీ చేసినా ఏదో నామ్ కే వాస్తే టైపు నామినేషన్ వేయాలని చూస్తున్నారు. చాలా మందికి ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే క్లారిటీ రావడంతో ముందుగానే అస్త్రసన్యాసం చేసే వారు కొందరు అయితే.. మరికొందరు విల్లులు, ఆయుధాలు వదిలేసి యుద్ధంలోకి వస్తుండడం కామెడీ అవుతోంది.