ఇంత సిల్లీ రీజన్ చెప్పి మార్పును సమర్ధించుకోవడం.. ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి
అలానే ఉంచాలి. అప్పుడే విశాఖకు ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను ఛిద్రం చేసి నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయి కదా అని అక్కడికి రాజధాని షిఫ్ట్ చేయడం అవివేకం. రాజధాని కట్టడానికి లక్ష కోట్ల రూపాయలు కావాలనేది మరో విచిత్రమైన వాదన. లక్ష కోట్లు ఎందుకు అవసరం అవుతాయి? ఐకానిక్ బిల్డింగుల పేరుతో చంద్రబాబు చేసినట్లు జిమ్మిక్కులు చేయాలంటే అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఉన్న భవనాలు అలాగే ఉంచినా ఎవరూ కాదనరు. ఇప్పుడు ఉన్న భవనాలు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. అటు విజయవాడా కాదు ఇటు గుంటూరు కాదు అని ముఖ్యమంత్రి మరో కామెంట్ చేశారు. విజయవాడ, గుంటూరులలో గజం స్థలం దొరుకుతుందా? అందుకే రెంటికి మధ్యలో రాజధాని నిర్మించారు. అక్కడ ల్యాండ్ అభివృద్ధి చేసుకోవాలి చేతైనతే. అంతే కానీ అమరావతికి రోడ్డు లేదు కాబట్టి విశాఖ పట్నం పోతున్నామని చెప్పడం అన్యాయం, దారుణమన్న కధనం సోషిల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విధంగా ఎపి ప్రజలను తమ స్వార్ధ ప్రయోజనాలను ఆశించి దారి మళ్లించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని హ్యూమన్ రైట్స్ ప్రతినిధి ర్యాలీ చంద్ర శేఖర రావు పేర్కొంటున్నారు.