12 ఏళ్లుగా అత్యాచారం చేస్తే.. ఇప్పుడెందుకు ఇలా చేసింది..?
ఆ తర్వాత పటాన్చెరులో అడ్వకేట్ రఘునందన్రావును సంప్రదించి.. పోషణ ఖర్చుల కోసం భర్తపై సంగారెడ్డి కోర్టులో కేసు (నం.16/2003) వేసింది. ఈ క్రమంలో 2007 డిసెంబరు 2న కేసు గురించి మాట్లాడేందుకు ఆఫీసుకు రావాలంటూ రఘునందన్ ఆమెను పిలిచారు. కేసు విషయం చర్చిస్తుండగా ఇంట్లోకి వెళ్లి కాఫీ తెచ్చి ఆమెకు ఇచ్చారు. అది తాగిన వెంటనే కళ్లు తిరుగుతున్నట్లు అనిపించింది. రఘునందన్ ఆమెను గదిలోకి తీసుకెళ్లబోగా విడిపించుకునేందుకు పెనుగులాడింది. అయినా ఆయన ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు. మెలకువ వచ్చాక తనపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న ఆమె రఘునందన్ను నిలదీసింది. ‘పోలీసు కేసు పెట్టినా, విషయం ఎవరికైనా చెప్పినా చంపేస్తా. నీ నగ్న చిత్రాలు నా దగ్గరున్నాయి. వాటిని ఇంటర్నెట్లో పెట్టి నీ జీవితాన్ని నాశనం చేస్తాన’ంటూ ఆమెను బెదిరించారు. ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే రాజకీయ పలుకుబడితో, రౌడీలతో బెదిరించారు. గతేడాది మార్చిలో రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు (ఎస్ఆర్ 998/2019) చేయగా కేసు నమోదు చేసి, చర్య తీసుకోవాలని గత నెల 23న రామచంద్రాపురం పోలీసులను ఆదేశించింది. అనంతరం ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం కమిషనర్ను ఆశ్రయించింది. సీపీ ఆదేశాలతో రఘునందన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ రమే్షకుమార్ తెలిపారు. ఈ ఆరోపణలను రఘునందన్ ఖండించారు. సజ్జనార్ ఆదేశాలతో రామచంద్రాపురం పోలీసు స్టేషన్లో రఘునందన్పై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధిత మహిళ (47) ఫిర్యాదు ప్రకారం.. రామచంద్రాపురం ఠాణా పరిధి జ్యోతినగర్కు చెందిన ఆమె 2003లో భర్తపై పోలీస్ స్టేషన్లో గృహ హింస కింద కేసు పెట్టింది.