పార్టీలోని నేతల సమాచారం ప్రకారం రాజధాని తరలింపు అంశాన్ని చంద్రబాబు, జేఏసి నేతల చేతుల్లో నుండి బిజెపి హైజాక్ చేయాలని వ్యూహాలు పన్నుతోందట. అందుకనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చేరదీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిజెపి, పవన్ ఒకళ్ళ అవసరం మరొకళ్ళకుందన్నది వాస్తవం. పవన్ కు లీడర్లు, క్యాడర్ లేదు. అలాగే బిజెపికి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి ఉండే నేత లేడు. కాబట్టి ఇద్దర కలిస్తే రాష్ట్రంలో సునామి సృష్టించ వచ్చనే ఆలోచనలో ఉన్నారట. అసలు తమతో చంద్రబాబునాయుడును కూడా కలుపుకోవాలని పవన్ నడ్డాతో చెప్పినట్లు ప్రచారం