ప్రధాని ఇలాఖాలో దారుణం.. మైనర్ను రేప్ చేసి వ్యభిచారిగా మార్చిన దుర్మార్గులు
దీంతో అప్రమత్తమైన పోలీసులు ముగ్గురినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అత్యాచార బాధితురాలితో పాటు వారి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. వారణాసికి చెందిన విశాల్ మౌర్యా, ఉత్కర్ష్ తివారి, జమీర్ ఆలంలు మైనర్ బాలికకు ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పి ముంబై తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి వ్యభిచార గృహానికి విక్రయించారు. అయితే బాధిత బాలిక వ్యభిచార గృహం నుంచి ఎలాగోలా తప్పించుకొని అలహాబాద్కు రావడంతో అక్కడి రైల్వే పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
దీంతో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో బాధితురాలు, బాలిక తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే బాధితురాలి వద్ద ఓ లేఖను పోలీసులు కనుగొన్నారు. అందులో తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేయడం లేదని, వారిపై నమోదు చేసిన వివిధ సెక్షన్లను సైతం తొలగించారని బాధితురాలు తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉంది.