నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. ఊరు ఊరులోను బెల్టుషాపులను ఏర్పాటు చేసి చాలా ఇళ్ళను చంద్రబాబు ప్రభుత్వం గుల్ల చేసేసింది. మద్యం షాపులను పెంచేసి, బార్ అండ్ రెస్టారెంట్లను పెంచేయటమే కాకుండా వాటికి అదనంగా సుమారు 43 వేల బెల్టుషాపులను ప్రోత్సహించింది. పనిలో పనిగా ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఏకంగా అధికారులను పెట్టి  మద్యాన్ని అమ్మించింది చంద్రబాబు ప్రభుత్వం.