బాల్యమే భవిత.. చిన్నారుల పెంపంకంలో ఈ విషయాలే కీలకం
బుడిబుడి అడుగులు వేసే చిన్నారులకు ఆ వయసులో అందించే ఆహారం, పాలే వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక, చిన్నారుల జీవితాలకు నేడు ఆదరణ తగ్గుతోందనేది ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పెద్ద వాదన. ఇది నిజమేనని అంటోంది ఐక్యరాజ్యసమితిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా. గడిచిన ఐదేళ్ల రికార్డును పరిశీలిస్తే.. మన దేశం విషయానికి వస్తే.. చిన్నారుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా తొలి మూడున్నరేళ్ల వయసులోనే తనువు చాలిస్తున్న చిన్నారుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోందని ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దీనికి ప్రధానంగా పోషకాహార లోపం. తల్లిపాల నిర్వహణ. సరైన సమయంలో వైద్యం అందకపోవడమేనని చెబుతోంది. ప్రధానంగా 0-10 ఏళ్ల చిన్నారులను కొన్ని వర్గాలుగా విభజిస్తూ.. వారికి సరైన పోషణ అందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. చిన్నారుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఇద్దరిదీ సమానమే అయినప్పటికీ.. తల్లులకే ఎక్కువగా బాధ్యత ఉండాలని సూచిస్తోంది. ఆహారం నుంచి వారి ఆరోగ్యం వరకు తల్లులు మరింత శ్రద్ద కనబరచాలని చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న సూచనలు, సలహాలు ఏంటో చూద్దాం.
+ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి పాలు ఖచ్చితంగా పట్టాలి. ఇలా కనీసం బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు కొనసాగించాలి.
+ తల్లికి పాలు పడేందుకు ఇంజన్లు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇలా చేయడం బిడ్డకు హానికరం. దీనిస్తానంలో మెరుగైన ఫలాలు, ఆహారం తీసుకోవడం అత్యుత్తతమం.
+ సమయానికి వైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. ముఖ్యంగా {{RelevantDataTitle}}