కొన్నేళ్ల నుండి భారతీయులందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పు కాసేపటి క్రితం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును చదివి వినిపించారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా ఈ తీర్పు వెల్లడించడం జరిగిందని, వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేస్తున్నట్లు తెలిపారు. అలానే నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్ను సైతం తోసిపుచ్చింది.