తెలంగాణలో జరిగిన విజయారెడ్డి
హత్య తరువాత అవినీతి ఆరోపణలు నుంచి దూరంగా ఉండడానికి చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఏఎస్సై, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఏపీతోపాటు
హైదరాబాద్, బెంగళూరులో నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్టు పోలీస్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గుణ్ణం వీరవెంకటసత్యనారాయణచౌదరి, ఆయన బంధువుల నివాసాల్లో
ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
కాకినాడ, సామర్లకోట, యానాం, గండేపల్లి, అరట్లకట్టలో ఏఎస్పీ బృందం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా లభ్యమైన ఆస్తుల విలువ రూ.3 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినా మార్కెట్ విలువ ప్రకారం రూ.10 నుంచి 20 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు.
ఏఎస్సై నివాసంలో 1.5 కేజీల బంగారు,
వెండి ఆభరణాలు, రూ.3 లక్షల నగదు, 100కుపైగా ప్రామిసరీ నోట్లు, కాకినాడలో ఎనిమిది ఖాళీ స్థలాలు, 50 సెంట్ల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు,
కాకినాడ, సామర్లకోటలో రెండేసి ఇళ్లు, కరప మండలం, అరట్లకట్టలో ఇల్లు, చర్చి, యానాంలో మరో భవనం ఉన్నట్టు సోదాల్లో గుర్తించారు. ఏఎస్సై సత్యనారాయణచౌదరిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను రిమాండుకు తరలించారు.
సత్యనారాయణ
చౌదరి 1984, జులై 16న ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరి, 2013లో ఏఎస్సైగా ప్రమోషన్ పొందాడు. 35 ఏళ్ల ఆయన సర్వీసులో ఎక్కువ కాలం కాకినాడలో విధులు నిర్వహించారు.ఇక,
విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాలసాని మురళీగౌడ్ నివాసంలోనూ నెల్లూరు డీఎస్పీ దేవానంద్శాం నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. . హైదరాబాద్,
తిరుపతి, బెంగళూరు, విజయవాడలో ఏకకాలంలో
ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఆయన ఆస్తుల విలువ రూ.1,38,75,000 గా ఉంటుందని.డీఎస్పీ దేవానంద్ తెలిపారు. తిరుపతిలోని టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్
శారద, బిల్
కలెక్టర్ శ్రీనివాస్ నివాసాల నుంచి మురళీగౌడ్కు చెందిన రూ.13లక్షలు, రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు
ఏసీబీ సీఐ విజయశేఖర్ మీడియాకు వెల్లడించారు.