చంద్రబాబు, లోకేష్ బాబు చేతులకు రాఖీలు .. ఎవరు కట్టారంటే

guyyala Navya
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని సుపుత్రుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ అంగరంగా వైభవంగా రాఖి పండుగను జరుపుకున్నారు. అంత ఘనంగా చంద్రన్న, లోకేష్ అన్న రాఖి పండుగను ఎవరితో జరుపుకున్నారు అబ్బా అని అనుకుంటున్నారా ?     


అదేనండి మన మాజీ మంత్రులు.. పరిటాల సునీతమ్మ, భూమా అఖిల ప్రియా రెడ్డి లు నారా కుటుంబానికి చెల్లెల్లు అయ్యారు. ఈ విషయాలను స్వయానా నారా లోకేష్ గరే నెటిజన్లతో పంచుకున్నారు. పరిటాల సునీత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్ లోని చంద్రన్న నివాసంలో నిన్న సాయింత్రం ఆయనకు రాఖి కట్టారు.                                                          


నేడు నారా లోకేష్ కు మాజీ మంత్రి అఖిల ప్రియా రాఖి కట్టి రాఖి పూర్ణిమను ఘనంగా జరుపుకున్నారు. అయితే అఖిల ప్రియతో రాఖి కట్టించుకున్న నారా లోకేష్ ఆనందంలో ఫోటోలను ట్విట్టర్ వేధికగా నెటిజన్లకు షేర్ చేశారు. దీంతో నెటిజన్లు స్పందిస్తూ కొందరు హర్షం వ్యక్తం చేస్తే మరి కొందరు ట్విట్ చేస్తూ 'సునీతమ్మకు చంద్రబాబు అన్న, ప్రియమ్మకు లోకేష్ బాబు అన్న.. సరిపోయింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


Thank you Akhila!
Truly blessed to have you as my sister!!#HappyRakshabandhan pic.twitter.com/fF3Mzf6roJ

— Lokesh Nara (@naralokesh) August 15, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: