ఈ మద్య భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. చిన్నారులు, వృద్దులు అన్న తారతమ్యం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 15న ముంబైలో ఓ మోడల్ హత్య సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే..జీవితంలో గొప్ప మోడల్, నటి కావాలన్న ఆశతో జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది మన్సీ దీక్షిత్ (20) . ఈ నేపథ్యంలో ఫొటోగ్రాఫక్ సయ్యద్తో పరిచయం అయ్యింది.
ఆమెకున్న లక్ష్యాన్నే .. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అందమైన ఫొటోలు తీయాలనే నెపంతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను లోబర్చుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఫొటోలు తీసేందుకంటూ మాన్సీని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికొచ్చిన ఆమె వద్ద తన కోరికను బయటపెట్టాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోతూ స్టూలుతో తలపై కొట్టాడు. ఆమెపై దాడి చేసి మెడకు లేసును గట్టిగా బిగించి.. రాక్షసంగా ప్రాణాలు తీశాడు.ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి.. క్యాబ్ లో తీసుకెళ్లి ముంబైలోని ఓ ఫుట్పాత్ మీద వలిలేసి వెళ్లిపోయాడు.
అయితే, సంచిలో మృతదేహం ఉందని గమనించిన క్యాబ్ డ్రైవర్ ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. అతడిచ్చిన సమాచారంతో నిందితుడు ముజమ్మిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, జరిగిన విచారణలో నిందితుడు అసలు విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన కామ వాంఛ తీర్చనందుకే మన్సి దీక్షిత్ ని అతి కృరంగా హింసించి చంపినట్లు ఓప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.