సరికొత్త స్పీచ్ లో చంద్రబాబు ని ఫుట్ బాల్ ఆడేసిన జగన్ !!

KSK

అధికార పక్షాన్ని ఫుట్ బాల్ ఆడుకోవడం లో జగన్ మోహన్ రెడ్డి స్టైల్ , రిఫరెన్స్ వేరేగా ఉంటాయి .. చాతుర్యం దగ్గర నుంచీ పర్ఫెక్ట్ డేటా తో సహా జగన్ చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. సంబంధం లేని గాలి విమర్సల కి ఆయన ఎప్పుడూ చోటు ఇవ్వలేదు. సరికొత్తగా లాజికల్ గా దెబ్బకొట్టే ప్రయత్నం చేసారు జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కి .. 


ఈ మధ్య కాలం లో పాదయాత్ర ద్వారా సూపర్ సక్సెస్ అయిన జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ తనదైన శైలో లో దూసుకు పోతున్నారు. రీసెంట్ గా ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కి చేరింది. ఇక్కడ భహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ యాత్ర లో భాగంగా అనపర్తి ప్రజలు తనకి చాలా విషయాలు చెప్పారు అని అందులో దాదాపు అన్ని విషయాలూ కూడా తనని ఆశ్చర్యపరిచాయి అని కొత్త నాడి లో మాట్లాడారు జగన్.  " ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లో జీఎస్తీ మాత్రమే కాదు చినబాబు - పెదబాబు టాక్స్ కూడా అమలు అవుతోంది అని జనం నాకు చెప్తున్నారు.



ఏ రాష్ట్రం లో కూడా ఏ ప్రభుత్వం వసూలు చెయ్యని తరహా లో ఏపీ లో టీడీపీ ప్రభుత్వం సొంతగా పార్టీ కి సంబంధించిన టాక్స్ వసూలు చేస్తోంది " అంటూ ఏపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ని ఎండగట్టారు ఆయన. లంచాలు కలక్టర్ ల దగ్గర మొదలు పెట్టుకుని ఎమ్మెల్యే లకి చేరి ఆ తరవాత చంద్రబాబు - పెదబాబు ద్వారా చినబాబు లోకేష్ దగ్గరకి చేరుతోంది అని ఫుట్ బాల్ ఆడుకున్నారు జగన్. ఇక్కడ లంచాలు కలెక్టర్ నుంచి ఎమ్మెల్యేల వరకూ.. చినబాబు నుంచి పెదబాబు వరకూ అందుతున్నాయన్నారు.



ఈ నియోజకవర్గంలో లేఔట్లు వేయాలంటే ఎకరాలకు రూ.2లక్షలు చెల్లించాల్సిందేనన్నారు. మద్యం షాపు నుంచి ఎమ్మెల్యేలకు నేరుగా ట్యాక్స్ వెళుతుందన్న జగన్.. మద్యం సరఫరాను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రతి మద్యం దుకాణం నుంచి స్థానిక ఎమ్మెల్యేకు రూ.2లక్షల చొప్పున మామూళ్లు కట్టిస్తున్నారన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: