ఈ మద్య మహిళలపై లైంగిక వేధింపులు దారుణంగా జరుగుతన్న నేపథ్యంలో 34 ఏళ్ల మహిళా టీచర్ 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన సంఘటన కలకలం రేపింది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు బాలుడిని లైంగికంగా వేధించి కటకటాల పాలయ్యారు. ట్యూషన్ పేరుతో బాలుడిని తన ఇంట్లో పెట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతో విషయం బయటకు వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు చైల్డ్లైన్ హెల్ప్లైన్కి సమాచారమివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం..చండీగఢ్, సెక్టార్ 31లోని రామ్దర్బార్లో నివాసముండే 34 ఏళ్ల మహిళా టీచర్ తన ఇంటి పక్కనే ఉండే 14 ఏళ్ల బాలుడి కొంత కాలంగా లైంగికంగా వేధింపులకు గురిచేస్తుంది. పదో తరగతి చదువుతున్న బాలుడికి, అతని చెల్లికి ఆమె 2017 నుంచి ట్యూషన్ చెప్తున్నారు. అయితే ఇద్దరికీ వేరు వేరుగా ట్యూషన్ చెప్పాలని పంతులమ్మ తల్లిదండ్రులకు చెప్పింది..సరే అని అన్నా చెల్లెల్ని వేరు వేరు గా పంపించడం మొదలు పెట్టారు.
కొంత కాలం తర్వాత బాలుడి తీరులో చాలా మార్పు వచ్చింది..చదువు కూడా పూర్తిగా పాడైపోవడంతో లాభం లేదని ట్యూషన్ మాన్పించారు. అయితే, తిరిగి ట్యూషన్కి పంపించాలని బాలుడి తల్లిదండ్రులని ఆ టీచర్ గత నెలలో ఒత్తిడి చేసిందని పోలీసులు వెల్లడించారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలుడిని ట్యూషన్ పంపం అని మొండి పట్టు పట్టడంతో సోమవారం పంతులమ్మ దగ్గుమందు తాగి ఆత్మహత్యం చేసింది.
దాంతో పరిస్థితి భయానకంగా మారడంతో బాలుడి తల్లిదండ్రులు చైల్డ్లైన్ హెల్ప్లైన్ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్కో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చండీగఢ్ ఎస్పీ నీలాంబరి విజయ్ జగదల్ తెలిపారు. ప్రస్తుతం ఆ పంతులమ్మను జ్యూడీషియల్ కస్టడీకి తరలించామన్నారు. గతంలో ఓ ప్రభుత్వ స్కూల్ టీచరమ్మ ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులకు గురిచేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.