మీ వయస్సు ఎంత.. మీరు కుర్రాడా.. కాలేజ్ బోయా.. లేక నడి వయస్సా.. పర్లేదు.. మీరంతా 50 ఏళ్ల లోపు ఉంటే చాలు.. ఈ వార్త మీ జీవితాన్నే మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే .. 1970 తర్వాత పుట్టిన వాళ్లు మరణాన్ని జయించే అవకాశం ఉంది. ఏంటీ జోక్ చేస్తున్నా అనుకుంటున్నారా..జోక్ కాదు.. ఇది నిజమే.. కాకపోతే అందులో సంభావ్యత శాతం ఎంతో తేలాల్సి ఉంది.
అవును.. మనిషి మరణానికి కారణం మనిషి శరీరం కుంగి కృశించిపోవడమే.. మరి ఆ పెరుగుదల వల్ల జరిగే నష్టాన్ని ఆపగలిగితే.. మరణాన్ని ఆపొచ్చా.. ఆపొచ్చంటున్నారు శాస్త్రజ్ఞులు ఇప్పటికే వారు ఈ దిశగా కొంత ముందడుగు వేశారు. మనిషి శరీరం వయస్సు కారణంగా క్షీణించడాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. ఇదే జోరుతో పరిశోధనలు సాగితే.. 2050 నాటికి పూర్తిగా మరణాన్ని జయంచగలమంటున్నారు.
ఈ మాట చెబుతున్ననిద పియర్సన్ అనే ఓ సైంటిస్టు.. ఆ ఇలాంటి కబుర్లు చాలా చెప్పారు అని తీసిపారేయకండి. ఎందుకంటే.. ఈ పియర్సన్ ఊహించి చెప్పినవి చాలా జరిగాయి కూడా. ఏదేమైనా పియర్సన్ చెప్పింది నిజమైతే.. 1970 తర్వాత పుట్టినవారు మరణాన్ని జయించే అవకాశం ఉంది. మరి ఇకపై పుట్టిన వారు మరణించే ఛాన్సు లేకపోతే.. కొన్నాళ్లకు భూమి సరిపోతుందా.. వనరులు సరిపోతాయా..?
ఇలాంటి ప్రశ్నలు అడక్కండి.. వాటికి సమాధానం చెప్పడం మాపని కాదు అంటున్నారు సైంటిస్టులు.. మరణాన్ని జయించడంపైనే తమ ఫోకస్ అంటున్నారు. చూద్దాం 2050 తర్వాత ఏంజరుగుతుందో..!?