డేరా బాబా కన్నా దుర్మార్గుడు..!

siri Madhukar
ఆ మద్య భారత దేశంలో పెను సంచలనాలు సృష్టించిన డేరాబాబా గురించి మరువక ముందే మరో దొంగ బాబా అకృత్యాలు బయట పడ్డాయి.   తమ వద్దకు వచ్చిన భక్తులకు ఉపదేశాలు..బోధనలు చేస్తూ గొప్ప పేరు తెచ్చుకోవడమే కాకుండా...దేశ భక్తికి సంబందించిన సినిమాలు తీసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న హర్యానాలోని సిర్సా ప్రాంతంలో డేరా సచ్చా సౌధా ఆధ్వర్యంలో ఆశ్రమాన్ని నెలకొల్పి.. ఎందరో మహిళలను బందీలుగా చేసుకున్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా అలాంటి దొంగ బాబా ఒకరు ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నట్లు.. ఎందరో మహిళలను లొంగదీసుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి. వీరేంద్ర దేవ్ దీక్షిత్ అనే బాబా నడుపుతున్న ఆశ్రమాలపై లెక్కకు మించి కేసులు నమోదవుతున్న క్రమంలో ఢిల్లీ హైకోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. ఆ బాబాపై వారెంట్ కూడా జారీ చేసింది.  ఎంతో మంది అమాయక చిన్నారులను తన ఆశ్రమంలో బంధీలుగా ఉంచి వారిపై సాధువులు పైశాచికంగా అత్యాచారాలు చేయడం, హింసించడం వంటివి బయటకు వచ్చాయి. 

ఇప్పటికే అదే ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న రోహిణి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో చదువుతున్న 40 మంది విద్యార్థులను ఢిల్లీ మహిళా  కమీషన్ బయటకు తీసుకొచ్చింది. అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న 13 ఏళ్ళ బాలికపై బాబా అత్యాచారం చేశాడనే ఆరోపణలు తలెత్తడంతో కమీషన్ కోర్టును ఆశ్రయించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: