ముందు నుండి అనుకున్నట్లే ప్రత్యెక తెలంగాణా రాష్ట్రానికి తన అనుకూలమని, తాను ప్రత్యేకవాదినని కాంగ్రెస్ పార్టీ కి చెందిన అమలాపురం ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్రం సరైన దిశలోనే ఆలోచిస్తుందని ఆయన తెలిపారు.
రాజమండ్రి సభకు పీసీసీ చీఫ్ బొత్స వెళ్లాల్సింది కాదని , సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకు కృషి చేయాలని ఆయన ఇరు ప్రాంతాల నేతలకు సూచించారు. 2009 లో కూడా ఎంతగా సమైక్య జేఏసీ ఒత్తిడి చేసినప్పటికీ హర్షకుమార్ మాత్రం తెలంగాణా రాష్ట్రం ఇస్తే తప్పేంటని చెప్పుకొచ్చారు. ఇరు ప్రాంతాల నేతలు మాటల్లో హద్దు మీరుతున్నా ఆయన మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా తన మనసులో మాటను బయట పెట్టారు .
మరింత సమాచారం తెలుసుకోండి: