ఏపీ: నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చక్కటి తీపికబురు లాంటి వార్త. ఎందుకంటే అతి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు తెలిపారు. ఈ రోజు మంత్రి బోత్సా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇంకా ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వంటి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.ఆయన డీఎస్సీ నోటిఫికేషన్ ని ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఇక మంత్రి ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘సీఎం జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయంని తీసుకుంటానన్నారు.ఉపాధ్యాయులు ఇంకా ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం. త్వరలో బదిలీలపై నిర్ణయంని తీసుకుంటాం.అలాగే బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. దీని కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా మేము పరిశీలిస్తున్నాం. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నాం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామని వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం.ప్రస్తుతం పాఠశాలల్లో పరీక్షలు ఇంకా ఒంటి పుట బడులు జరుగుతున్నాయి. అందుకే చిక్కిలు ఇస్తున్నామన్నారు.


అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. ‘విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీసుకురావడం జగన్‌ ప్రభుత్వం పాలసి. మేము ఎవ్వరినీ కూడా డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టాడా..? అమరావతి రాజధాని అయితే చంద్రబాబు నాయుడు కాపురం హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? కాపురానికి, రాజధానికి అసలు సంబంధం ఏంటో? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొంతమంది మాట్లాడారు..ఇక నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్‌తో ఆ విషయం కూడా స్పష్టమయింది. ఇక మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు మా ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.చంద్రబాబు మంచి నటుడు అలాగే మ్యానిపులేటర్‌ కూడా. ఇక తన తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు’ అని మంత్రి బొత్సా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: